అమరావతి : ఈ ఏడాది తప్పనిసరిగా పదో తరగతి పరీక్షలు ఉంటాయని, మరో వారం రోజుల్లో టెన్త్ ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ మేరకు మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. మే నెలలో టెన్త్ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది 11 పేపర్లా..? లేక 6 పేపర్లా..? అనే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.