న్యూఢిల్లీ : భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2021 ఏడాదికి పద్మ విభూషణ్-7, పద్మభూషణ్ -10, పద్మ శ్రీ – 102 ఇలా మొత్తం 119 మంది వివిధ రంగాలకు చెందిన వారు పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు.
72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని కేంద్రం పద్మ విభూషణ్ తో గౌరవించింది. కళా రంగంలో తెలంగాణకు చెందిన కనకరాజుకు పద్మ శ్రీ పురస్కారం దక్కింది.
పద్మ విభూషణ్ పురస్కార గ్రహీతలు :
1. షింజో అబే ( జపాన్ మాజీ ప్రధాని)
2. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ( గాయకుడు )
3. బెల్లె మోనప్ప హెగ్డే ( వైద్య రంగం)
4.నరీందర్ సింగ్ ( సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అమెరికా )
5. మౌలానా వహిదుద్దీన్ ఖాన్ (ఆధ్యాత్మికత )
6. బీబీ లాల్ (ఆర్కియాలజీ )
7. సుదర్శన్ సాహూ ( ఆర్ట్ )