చెన్నై: చెపాక్లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఇంగ్లాండ్ తో సెకండ్ టెస్టులో ఫస్ట్ బ్యాట్తో విజృంభించిన టీమిండియా ఇప్పుడు బంతితోనూ ప్రత్యర్థిని తిప్పేసింది. స్పిన్కు సహకరిస్తున్న పిచ్పై ఇంగ్లాండ్ జట్టును 150 రన్స్ లోపే చుట్టేసింది. టీమిండియా స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడంలో తడబడిన ఇంగ్లాండ్ జట్టు కొద్ది స్కోరుకే పరిమితమైంది. సెకండ్ డే ఆటలోనూ కోహ్లీసేన పైచేయి సాధించింది.
టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(5/43) తన మాయాజాలాన్ని ప్రదర్శించి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. ఇషాంత్ శర్మ(2/22), అక్షర్ పటేల్(2/40)కట్టుదిట్టంగా బంతులేయడంతో మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 59.5 ఓవర్లలో 134 రన్స్కే ఆలౌటైంది. ఇంగ్లాండ్ ఇంకా 195 రన్స్ వెనుకబడి ఉంది.
బెన్ఫోక్స్ (42 నాటౌట్ : 107 బంతుల్లో 4 ఫోర్లు) టాప్స్కోర్. రోరీ బర్న్స్(0), డొమినిక్ సిబ్లే (16), డేనియల్ లారెన్స్ (9), జోరూట్ (6), బెన్ స్టోక్స్(18), ఓలీ పోప్ (22), మెయిన్ అలీ(6), ఆతిథ్య బౌలర్ల దెబ్బకు పెవిలియన్కు వరుస కట్టారు. అంతకుముందు మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా 329 రన్స్కు ఆలౌటైంది.