ముంబై : దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పలువురు ఆటగాళ్లు కరోనా బారినపడ్డారు. బీహార్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర జట్లకు చెందిన ఒక్కో ఆటగాడికి కొవిడ్- 19 పాజిటివ్గా నిర్ధారణ అయిందని బీసీసీఐ అధికారి ఒకరు ధ్రువీకరించారు. ముగ్గురు ఆటగాళ్లను ప్రస్తుతం ఐసోలేషన్లో ఉంచారు. గతవారమే మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ ప్లేయర్లకు పాజిటివ్గా తేలింది. దీంతో ఇరుజట్లలోని ఆటగాళ్లందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలోని జమ్ముకశ్మీర్కు చెందిన ఓ క్రికెటర్కు కరోనా సోకింది.
Home Sports