బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్లు జైలు శిక్ష

బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్లు జైలు శిక్ష

శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టిన స్టాలిన్ ప్రభుత్వం
ఆమోదించిన తమిళనాడు గవర్నర్వరంగల్ టైమ్స్, తమిళనాడు : ఇకపై ప్రజల వద్ద బలవంతంగా రుణాలు వసూలు చేసినా, రుణేతర ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసినా ఐదేళ్ల జైలు శిక్ష తప్పదని తమిళనాడు ప్రభుత్వం హెచ్చరించింది. రుణసంస్థల ఒత్తిడితో ఎవరైనా బలవన్మరణానికి పాల్పడితే, ఆ సంస్థ నిర్వాహకులకు బెయిల్ రాకుండా జైలు శిక్ష అమలు చేసే విధంగా ఈ బిల్లును రూపొందించామని స్టాలిన్ ప్రభుత్వం పేర్కొంది.

ప్రజల వద్ద కొన్ని రుణసంస్థలు బలవంతంగా రుణాలు వసూలు చేస్తున్నాయని, రుణేతర ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నాయని ఇలాంటి సంఘటనలు ఆపడానికే ఈ బిల్లు ప్రవేశపెట్టామని తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది.