సిద్దిపేట జిల్లా : కల్పకవనం అర్బన్ ఫారెస్ట్ పార్క్ను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, హరీష్ రావు గురువారం ప్రారంభించారు. గజ్వేల్ మండలం సంగాపుర్ లో 117 హెక్టార్లలో రూ. 7.43 కోట్ల వ్యయంతో ప్రభుత్వం అర్బన్ ఫారెస్ట్ పార్క్ను ఏర్పాటు చేసింది. గజ్వేల్, వర్గల్ ప్రధాన రహదారిని అనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో అర్బన్ ఫారెస్ట్ పార్కును తీర్చిదిద్దారు.
పార్కు లోపల ‘సేవ్ ఫారెస్ట్..సేవ్ ఎర్త్’పేరిట ఏర్పాటు చేసిన భారీ గ్లోబ్, వాచ్ టవర్, ఒపెన్ జిమ్, చిన్న పిల్లల కోసం ప్రత్యేక ఆట స్థలం, గజీబో, రాశివనం, ఒపెన్ డైనింగ్, ఇతర సౌకర్యాలతో పార్కును సుందరంగా తీర్చిదిద్దారు. పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, పీసీసీఎఫ్ ఆర్ శోభ, ఎఫ్ డీ సీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ రోజా రాధ శర్మ, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా, గడ స్పెషల్ ఆఫీసర్ ముత్యంరెడ్డి, సీఎఫ్ శర్వానంద్, డీఎఫ్ వో శ్రీధర్ రావు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.