సంగారెడ్డి జిల్లా : నారాయణ ఖేడ్ నియోజకవర్గం కర్సిగుత్తిలో గిరిజన బాలికల రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు వెళ్లారు. ఈ సందర్భంగా తెలంగాణ -కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు జిల్లా బీదర్లోని ఓ గ్రామం వద్ద మంత్రి ఆగారు. అక్కడ ఉన్న గ్రామస్థులతో ముచ్చటించారు.తాగు, సాగు నీరు, విద్యుత్, రైతులకు అందుతున్న సాయంపై వివరాలు అడిగారు మంత్రి హరీశ్రావు.
మంత్రి : అమ్మా బాగున్నారా.. ? మీది ఏ గ్రామం.
మహిళలు : మాది కర్ణాటక రాష్ట్రం. బీదర్ జిల్లా జాంబిగ గ్రామంలోని గామ తండా వాసులం.
మంత్రి : మీకు పెన్షన్స్ ఇస్తోందా మీ ప్రభుత్వం. ఎంత ఇస్తున్నారు ..?
మహిళలు : మా ప్రభుత్వం ఐదువందల రూపాయలు పెన్షన్ ఇస్తుంది..
మంత్రి : తెలంగాణ రాష్ట్రంలోని మీ పక్కనే ఉన్న నారాయణఖేడ్ లో పెన్షన్ ఎంత ఇస్తున్నారో తెలుసా ?
మహిళలు : మా వాళ్లు అక్కడ ఉన్నారు సార్. రెండు వేల రూపాయలు ఇస్తున్నారు.
మంత్రి : విద్యుత్ ఎంత సేపు ఇస్తున్నారు.
రైతు: ఐదు గంటలు కూడా కరెంటు రావడంలేదు. ప్రతీ పది నిముషాలకు ఒక సారి కరెంట్ వస్తూ పోతూ ఉంటుంది. నా ఐదెకరాల పంటకు నీరు పారాలంటే పది రోజులు పడుతుంది సార్.
మంత్రి : పక్కనే నారాయణ ఖేడ్ లో కరెంటు ఎలా ఉంది.
గ్రామస్థులు: సార్ పక్కనే తెలంగాణ గ్రామాలు మాకు కనిపిస్తనే ఉంటుంది. 24 గంటలు కరెంట్ వస్తోంది. మేం చూస్తూనే ఉన్నాం. మా బాధలు తెలుసుకునే వారే లేరు.
మంత్రి : అమ్మా ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ సందర్భంగా ప్రభుత్వసాయం ఏమైనా అందుతుందా ?
మహిళలు – మాకేమీ ఇవ్వడంలేదు.
మంత్రి : మా రాష్ట్రంలో డెలివరీ సందర్భంగా కేసీఆర్ కిట్ అందజేస్తున్నాం.
మహిళలు : మీదగ్గర అన్నీ బాగా చేస్తున్నరు సార్.
మంత్రి : పెళ్లికి ఏమైనా సాయం చేస్తున్నరా ?
మహిళలు : లేదు సార్ ఏదీ సాయం అందడం లేదు.
మంత్రి : నారాయణ ఖేడే లో పెళ్లికి సాయం అందుతుంది
మహిళలు : మాకు తెలుసుసార్ , మా వాళ్లు ఉన్నారు. పెళ్లికి లక్ష రూపాయల సాయం అందుతోంది.
మంత్రి : మంచి నీటి సౌకర్యం అందుతుందా.. ? ఇంటింటికీ తాగు నీరు ఇస్తున్నారా. ?
మహిళలు : కిలో మీటర్ దూరం నుంచి ఇక్కడకు వచ్చి నీళ్లు పట్టుకుంటాం సర్. కరెంట్ వస్తే బిందలతో నీళ్లు తెచ్చుకుంటాం.
మంత్రి : వ్యవసాయానికి మీ ప్రభుత్వం సాయం చేస్తుందా. ?
రైతు : మాకు ఆరు వేలు మాత్రమే ఇస్తున్నారు సార్
మంత్రి : మేం ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున, ఎన్ని ఎకరాలుంటే అన్ని పది వేలు ఇస్తున్నాం.