2026లోగా భారత్ కు మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థలు
వరంగల్ టైమ్స్, రష్యా : ఆపరేషన్ సిందూర్ లో తన శక్తి సామర్థ్యాలు ప్రదర్శించిన క్షిపణి రక్షణ వ్యవస్థ ‘S-400’కు సంబంధించి రష్యా కీలక ప్రకటన చేసింది. వీటికి సంబంధించి భారత్ కు ఇవ్వాల్సిన మిగిలిన 2 యూనిట్లను 2026లోగా అందజేసేందుకు కట్టుబడి ఉన్నామని రష్యా తెలిపింది. భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ వీటి పనితీరు బాగుందని పేర్కొంది. గగనతల రక్షణ, యాంటీ డ్రోన్ సిస్టంపై భారత్ తో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించాలని రష్యా భావిస్తోంది.