8 రాజ్యసభ స్థానాలకు జూన్ 19న పోలింగ్

8 రాజ్యసభ స్థానాలకు జూన్ 19న పోలింగ్

వరంగల్ టైమ్స్, న్యూ ఢిల్లీ : వచ్చే రెండు నెలల్లో ఖాళీ అవుతున్న ఎనిమిది రాజ్యసభ స్థానాలకు జూన్ 19న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అస్సాం నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు పదవీకాలం జూన్ 14న ముగియనుంది. తమిళనాడులో 6 రాజ్యసభ స్థానాలకు పదవీకాలం జులై 24తో ముగిసిపోనుంది. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి ఈసీ జూన్ 2న ఎన్నికల నోటిఫికేషన్ ను ఎన్నికల సంఘం వెలువరించనుంది. నామినేషన్లకు చివరి తేదీగా జూన్ 9 ని తెలిపింది.