హైదరాబాద్ : కే సిరీస్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్ పై క్రిష్ బండిపల్లి నిర్మాతగా బీఎన్ఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రావణలంక. క్రిష్, అశ్విత, త్రిష జంటగా నటిస్తున్న ఈ సినిమాలో మురళి శర్మ, దేవ్ గిల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రావణలంక ఆడియోకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇది ఇలా ఉండగా సోమవారం మంత్రి హరీశ్ రావు రావణలంక టీజర్ ని విడుదల చేశారు. పూర్తి కమర్షియల్, ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ తో ఈ టీజర్ ని రెడీ చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టకునే రీతిన రావణలంకని తీర్చిదిద్దినట్లుగా దర్శకుడు బీఎన్ఎస్ రాజు తెలిపారు. ఫ్రిబవరిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత, హీరో క్రిష్ తెలిపారు.
‘ హీరో క్రిష్ నాకు బాగా తెలుసు. రావణ లంక సినిమా సాంగ్స్ బాగున్నాయి. విజువల్స్ బాగున్నాయని క్రిష్ చెప్పేవాడు.ఇప్పుడు చూస్తుంటే నిజం అనిపిస్తుంది. అతనికి మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. రేపు థియేటర్స్ లో కూడా దానికి మంచి రెస్పాన్స్ లభిస్తుందని భావిస్తున్నా’ అని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు.
నటీనటలు – క్రిష్, అశ్మిత, త్రిష, మురళిశర్మ, దేవ్ గిల్ తదితరలు
బ్యానర్ : కే సిరీస్ మ్యూజిక్ ఫ్యాక్టరీ
నిర్మాత : క్రిష్ బండిపల్లి
మ్యూజిక్ : ఉజ్జల్
సినిమాటోగ్రఫి : హజరత్ షేక్ (వలీ)
ఎడిటర్ : వినోద్ అద్వయ్
కో డైరెక్టర్ : ప్రసాద్
డైరెక్టర్ : బీఎన్ఎస్ రాజు