సరస్వతి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు
వరంగల్ టైమ్స్, తిరుపతి : అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం రాత్రి సరస్వతి అలంకారంలో స్వామివారు హంస వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
వాహన సేవలో డిప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, ఏవీఎస్వో సతీష్ కుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.