హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా టాలెంటెడ్ డైరెక్డర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘సర్కారు వారి పాట`. మైత్రీ మూవీ మేకర్స్ , జీఎమ్ బీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రెస్టీజియస్ మూవీని నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఎస్.ఎస్. సంగీత సారథ్యం వహిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు దుబాయ్లో ప్రారంభమైంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ `ది ఆక్షన్ అండ్ ది యాక్షన్ బిగిన్స్` అంటూ ఒక వీడియో విడుదల చేసింది చిత్ర యూనిట్.
‘సర్కారు వారి పాట` మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు దుబాయ్లో ప్రారంభమైంది. సూపర్స్టార్ మహేష్బాబును డైరెక్ట్ చేయాలన్న ఇన్నేళ్ల నా కల ఈ రోజు నిజమైంది. మహేష్ బాబుతో వర్క్ చేయడం చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఈ మూవీని ఒక ఛాలెంజింగ్ తీసుకుని చేస్తున్నాను. డెఫినెట్గా ప్రేక్షకుల, మహేష్ బాబు అభిమానుల అంచనాలకు తగినట్లుగా ఈ సినిమా పెద్ద స్థాయిలో ఉంటుంది. ఇరవై రోజుల పాటు దుబాయ్లో ఫస్ట్ షెడ్యూల్ జరగనుంది. ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’అన్నారు దర్శకుడు పరుశురామ్.
‘సర్కారు వారి పాట రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’ అన్నారు తమన్ ఎస్. ఎస్ థమన్.
సూపర్స్టార్ మహేశ్బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు మరియు భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి,
సంగీతం : తమన్ ఎస్.ఎస్
సినిమాటోగ్రఫీ : మధి
ఎడిటర్ : మార్తాండ్ కే వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్ : ఏ ఎస్ ప్రకాష్
ఫైట్ మాస్టర్ : రామ్ – లక్ష్మణ్
పీఆర్వో : బీఏ రాజు
లైన్ ప్రొడ్యూసర్ : రాజ్ కుమార్
కో డైరెక్టర్ : విజయ రామ్ ప్రసాద్
సీఈవో : చెర్రీ
నిర్మాతలు : నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట,
రచన, దర్శకత్వం : పరశురామ్ పెట్ల