చిత్తూరు జిల్లా : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్రాజన్ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గవర్నర్కు టీటీడీ ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి గవర్నర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గవర్నర్ను పట్టు వస్త్రాలతో ఘనంగా సత్కరించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ‘స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇతర దేశాల సహాయం లేకుండా మనదేశంలో కరోనా వ్యాక్సిన్ రావడం గర్వకారణం. వ్యాక్సిన్ రావడానికి సహకరించిన ప్రధాని మోదీకి, డాక్టర్స్కు, ఫ్రంట్లైన్ వారియర్స్కు కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకుని ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్నా’ అని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు.
Home News