నేటి నుంచి టెట్ పరీక్షలు

నేటి నుంచి టెట్ పరీక్షలు

పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : నేటి నుంచి తెలంగాణ టెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి జూన్ 30 వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి.ఈ నేపథ్యంలో ఆయా పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో బీఎన్ఎస్ఎస్ 163(ఐపీసీ144) సెక్షన్ ఆంక్షలు అమలులో ఉంటాయని రాచకొండ సీపీ సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల లోపల నలుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడి వద్దని పూచించారు.

విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, ఆర్మీ, హోంగార్డు, ఫ్లైయింగ్ స్కాడ్స్, అలాగే అంత్యక్రియలకు సంబంధించిన ఊరేగింపులకు మినహాయింపు ఉంటుందని వెల్లడించారు. ఈ నిషేధ ఆగ్నలు నేడు ఉదయం 6 గంటల నుంచి జూన్ 30 వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు అమలులో ఉంటాయని తెలిపారు.