హైదరాబాద్: సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో భాగంగా చేపట్టిన ‘కోటి వృక్షార్చన’కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రార్థన మేరకు బుధవారం సీఎం కేసీఆర్ స్వయంగా రుద్రాక్ష మొక్కను నాటారు. తన పుట్టిన రోజు సందర్భంగా చేపట్టిన కోటి ‘కోటి వృక్షార్చన’పట్ల సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ను అభినందించారు.
Home News