హైదరాబాద్ : మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం మంత్రి తన పుట్టిన రోజు సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రికేటీఆర్ సూచనల మేరకు గిఫ్ట్ ఏ స్మైల్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా హైదరాబాద్లోని తన నివాసంలో మొక్కలు నాటారు. జన్మదినం సందర్భంగా ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ఎంపీ సంతోష్కుమార్ పిలుపు మేరకు మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చనను ఆదర్శంగా తీసుకుని తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటినట్లు మంత్రి తెలిపారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన రాజ్యసభ సభ్యులు సంతోష్కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. కావున ఎవరినీ కవలడం లేదని అన్యదా భావించొద్దని మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు.
