శ్రీవారి భక్తులకు శుభవార్త..

శ్రీవారి భక్తులకు శుభవార్త..

శ్రీవారి భక్తులకు శుభవార్త..వరంగల్ టైమ్స్, తిరుమల: ఏడుకొండల వెంకటేశ్వరస్వామి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. డిసెంబర్ కి చెందిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను సెప్టెంబర్ 25న సోమవారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు తెల్పింది.నిజానికి ఈ నెల 24న ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటాను విడుదల చేయాల్సి ఉండగా, సోమవారానికి వాయిదా వేసింది. అంతేకాకుండా తిరుమలలో వసతి గదుల కోటాను సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు భక్తులు గమనించాలని విజ్ఞప్తి చేసింది.