హైదరాబాద్ : అనారోగ్యంతో హైదరాబాద్ మలక్పేట్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వరంగల్ కు చెందిన సీఐ మల్లేశం ఆదివారం ఉదయం మృతిచెందారు. మల్లేశం 1982 బ్యాచ్ కు చెందిన వారు. వరంగల్లోని మట్టెవాడ, కేయూ ఎస్సైగా విధులు నిర్వహించారు. కరీంనగర్, కొడిమాల నుంచి ఎలక్సిటీ విజిలెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుండగా రెండు నెలల క్రితం సీఐగా పదోన్నతి పొందారు. సీఐ మల్లేశం స్వగ్రామం వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం ధర్మారం గ్రామం. ప్రస్తుతం ఆయన కుటుంబం రంగశాయిపేట్లో నివాసం ఉంటుంది. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. సీఐ మృతితో పలువురు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.