నాడు..నేడు వారిద్దరి ప్రాణాలు నిలిపిన 11A సీటు

నాడు..నేడు వారిద్దరి ప్రాణాలు నిలిపిన 11A సీటు

వరంగల్ టైమ్స్, అహ్మదాబాద్ : ఎయిరిండియా విమాన ప్రమాదంలో ఆ విమానంలో ఉన్న 242 మందికి గాను 241 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ భారత సంతతికి చెందిన బ్రిటిషర్ రమేశ్ విశ్వాస్ కుమార్ ఒక్కడే బతికి బయటపడ్డాడు. విమానం మంటల్లో కాలిపోతుంటే రమేశ్ విశ్వాస్ మాత్రం దాని నుంచి బయటపడి గాయాలతో నడుచుకుంటూ రావడ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

అయితే రమేశ్ విశ్వాస్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఉండే 11A సీటులో కూర్చుని ప్రయాణించడమే అతడి ప్రాణాలు దక్కడానికి కారణమి నిపుణులు చెబుతున్నారు. తన సీటుకు ముందే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండటంతో అతడు ఆ డోర్ తెరుచుకుని బయటికి రాగలిగాడని అంటున్నారు. కాగా 11A సీటులో ప్రయాణించి విమానం ప్రమాదానికి గురైనా వ్యక్తి ప్రాణాలతో బయటపడటం ఇదే తొలిసారి కాదు.

1998లో కూడా ఇలాంటి నమ్మశక్యంకాని ఘటనే చోటు చేసుకుంది. థాయ్ లాండ్ కు చెందిన నటుడు, గాయకుడు రువాంగ్ సాక్ లోయ చుసాక్ కూడా అచ్చం రమేశ్ విశ్వాస్ మాదిరిగానే విమాన ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గరి 11A సీటులోనే ప్రయాణించా. నాడు ప్రమాదానికి గురైన థాయ్ ఎయిర్ వేస్ కు చెందిన TG261 విమానంలో మొత్తం 146 మంది ఉండగా 101 మంది మరణించారు.

రువాంగ్ సాక్ లోయ్చుసాక్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటికి వచ్చారు. నాడు దక్షిణ థాయ్ లాండ్ లో విమానాన్ని ల్యాండింగ్ చేస్తుండగా అదుపుతప్పి బురదపొలాల్లో పడిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా ఎయిరిండియా ప్రమాదం నుంచి రమేశ్ ఒక్కడే ప్రాణాలతో బయటపడటం పై రువాంగ్ సాక్ స్పందించారు. ఈ విషయం తనకు ఒళ్లు గగుర్పొడిచేలా చేసిందని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

తనకు 27 యేళ్ల క్రితం జరిగిన ఘటన గుర్తుకొచ్చిందని చెప్పారు. తాను 20 యేళ్ల వయసులో ఉండా ఇలాగే ప్రమాదం నుంచి బయటపడ్డానని చెప్పారు. తాను కూడా 11A సీటులోనే ప్రయాణించానని తెలిపారు. నాడు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడటం తనకు పునర్జన్మ లాంటిదని అన్నారు. కాగా ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత రువాంగ్ సాక్ దాదాపు 10 యేళ్ల పాటు మళ్లీ విమానం ఎక్కలేదని తెలిసింది.