రాష్ట్రంలో ఆదివారం 1590 కరోనా పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఆదివారం 1590 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 1277 నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 23,902 కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, వైరస్‌ ప్రభావంతో ఇవాళ ఏడుగురు మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 295కు చేరింది. ఇవాళ 1166 మంది వైరస్‌ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 12703మంది డిశ్చార్జి అయ్యారు. మరో 10,904 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.రాష్ట్రంలో ఆదివారం 1590 కరోనా పాజిటివ్‌ కేసులుఆదివారం 5,290 మందికి కొవిడ్‌-19 పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 1,15,835మందికి టెస్టులు చేసినట్లు పేర్కొంది. ఆదివారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 1277, రంగారెడ్డి జిల్లాలో 82, మేడ్చల్‌ జిల్లాలో 125 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వివరించింది. సంగారెడ్డి, మహాబూబ్‌నగర్‌ జిల్లాల్లో 19 చొప్పున, సూర్యాపేట జిల్లాలో 23, నల్గొండ జిల్లాలో 14, కరీంనగర్‌, వనపర్తి జిల్లాలో4 చొప్పున, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాలో 3చొప్పున, నిర్మల్‌, వికారాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 2చొప్పున గద్వాల, రాజన్నసిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్‌ రూరల్‌, కామారెడ్డి, ఆదిలాబాద్‌, నారాయణ్‌పేట, పెద్దపల్లి, యాదాద్రి జిల్లాల్లో ఒక్కో కేసు.