ప్రముఖ సింగర్ వాణీ జయరాం ఇకలేరు

ప్రముఖ సింగర్ వాణీ జయరాం ఇకలేరు

ప్రముఖ సింగర్ వాణీ జయరాం ఇకలేరు

వరంగల్ టైమ్స్, చెన్నై : ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం (78) ఇకలేరు. నుదురుకు గాయమై గత కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్న ఆమె నేడు తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని నుంగమ్ బక్కమ్ లో గల హడ్డోస్ రోడ్డులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె తన ఇంట్లోనే జారిపడి చనిపోయినట్లు తెలుస్తున్నది. ఇంట్లో విగత జీవిగా పడి ఉన్న వాణిని స్థానికుల సహాయంతో పనిమనిషి ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.

తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్ 30న వాణీ జయరాం జన్మించారు. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో వాణీ జయరాం ఐదో సంతానం. ఆమె 1971లో గాయనిగా సినీరంగ ప్రవేశం చేశారు. కర్ణాటక సంగీతాన్ని ఔపోసన పట్టిన వాణీ జయరాం భారతదేశంలోనేగాక ప్రపంచవ్యాప్తంగా గొప్ప నేపథ్య గాయనిగా పేరు తెచ్చకున్నారు. వాణీ జయరాం అసలు పేరు కలైవాణి. తెలుగు, తమిళ, మరాఠీ, ఒరియా, మలయాళ, హిందీ, గుజరాతీ,భోజ్ పురి ఇలా మొత్తం 19 భాషల్లో 20 వేలకు పైగా పాటలను ఆమె పాడారు. ఆమె సేవలకు గుర్తింపుగా ఉత్తమ నేపథ్య గాయని విభాగంలో మూడుసార్లు ‘నేషనల్ ఫిల్మ్’ అవార్డు అందుకున్నారు. అంతేగాక, తమిళనాడు, కేరళ, ఒడిశా, గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు కూడా ఆమెను అవార్డులతో సత్కరించాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా వాణీ జయరాంకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది.