శ్రీవారి సన్నిధిలో కేంద్ర మంత్రి మురుగన్ 

శ్రీవారి సన్నిధిలో కేంద్ర మంత్రి మురుగన్

శ్రీవారి సన్నిధిలో కేంద్ర మంత్రి మురుగన్ 

వరంగల్ టైమ్స్,తిరుమల : కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డా.మురుగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ప్రాతః కాల సమయంలో కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వారి దర్శన అనంతరం తిరుమల నుండి వారు తిరుగు పయనమయ్యారు. ఈ సందర్భంగా మంత్రికి వీడ్కోలు పలికిన వారిలో జిల్లా మత్స్య శాఖ అధికారి చాంద్ భాషా, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య తదితరులు ఉన్నారు.