ప్రిన్సిపల్ సెక్రటరీని సన్మానించిన మేయర్

ప్రిన్సిపల్ సెక్రటరీని సన్మానించిన మేయర్వరంగల్ అర్బన్ జిల్లా: వివిధ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని బల్దియా మేయర్ గుండా ప్రకాశరావు రాష్ట్ర మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ ను కోరారు. నగరానికి వచ్చిన ప్రిన్సిపల్ సెక్రెటరీ ని బల్దియా కమిషనర్ కార్యాలయంలో మేయర్ మర్యాదపూర్వకం గా కలిసిచ, పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. ముఖ్యమంత్రి హామీ (సి.ఎం.ఏ)నిధులకు చెందిన అభివృద్ధి పనులకు బిల్లులను చెల్లించాలని, పారిశుద్ధ్య నిర్వహణ కోసం పట్టణ ప్రగతి నిధులతో 268 వాహనాలను కొనుగోలు చేసిన దరిమిలా వాటికి డ్రైవర్లను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమించాల్సిన అవసరం ఉందని మేయర్ ప్రిన్సిపల్ సెక్రటరీ కి తెలిపారు. దీనికి అనుమతి ఇవ్వాలని కోరగా ప్రినిసిపల్ సెక్రెటరీ స్పందించి అందుకు సంబంధించిన ప్రతిపాదనలు తనకు పంపితే అనుమతి మంజూరు చేస్తానని తెలిపారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలు 40% మించిపోకూడదనే నిబంధనలు ఉన్నందున మిగితా వేతనాలను ప్రభుత్వం భరించేలా చూడాలని కోరగా అందుకు సంబంధించిన ప్రతిపాదనలను పంపితే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ప్రినిసిపల్ సెక్రెటరీ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, బల్దియా కమిషనర్ పమేలా సత్పతి, కార్పొరేటర్ చింతల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.