సిరివెన్నెల మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

సిరివెన్నెల మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
హైదరాబాద్ : ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఎటువంటి సంగీత ప్రక్రియలతోనైనా పెనవేసుకుపోయే అద్భుత సాహిత్యాన్ని హృదయాలను గెలిచారని సీఎం తెలిపారు.

సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న ఆయన సాహిత్య ప్రస్థానం, సామాజిక, సాంప్రదాయ అంశాలను స్పృశిస్తూ మూడున్నర దశాబ్దాల పాటు సాగిందని గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి, సంగీత సాహిత్య అభిమానులకు తీరనిలోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.