క్యారీ బ్యాగ్ పై డబ్బులు వసూలు చేస్తే చర్యలు

సరుకులు కొంటే క్యారీ బ్యాగ్ ఫ్రీ
క్యారీ బ్యాగ్ పై డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవు
సూపర్ మార్కెట్లకు వినియోగదారుల ఫోరం హెచ్చరికక్యారీ బ్యాగ్ పై డబ్బులు వసూలు చేస్తే చర్యలుహైదరాబాద్ : సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్ , వాణిజ్య సముదాయాల్లో సరుకులు కొన్న వినియోగదారులకు ఉచితంగా క్యారీబ్యాగులు ఇవ్వాల్సిందేనని, లేదంటే చర్యలు తప్పవని తెలంగాణ వినియోగదారుల ఫోరం హెచ్చరించింది. క్యారీబ్యాగుపై షాప్ లోగో ఉన్నా లేకున్నా వినియోగదారుల నుంచి డబ్బులేమీ వసూలు చేయకూడదని ఆదేశించింది.

ఓయూ విద్యార్థి బెగ్లెకర్ ఆకాశ్ కుమార్ ఫిర్యాదుపై విచారణ అనంతరం ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆకాశ్ కుమార్ 2019 మే 5న హైదర్ గూడలోని డీమార్ట్ లో రూ.602.70 విలువైన నిత్యావసర వస్తువులను కొనుగోలు చేశాడు. క్యారీబ్యాగుకు రూ.3.50 వసూలు చేయడంతో వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు.

వినియోగదారుల ఫోరం దీనిపై మంగళవారం తీర్పు వెల్లడించింది. ఆకాశ్ కుమార్ నుంచి వసూలు చేసిన రూ.3.50 తిరిగి చెల్లించడంతో పాటు పరిహారంగా అతనికి రూ.1000 న్యాయసేవా కేంద్రానికి, మరో రూ.1000 చొప్పున 45 రోజుల్లోగా చెల్లించాలని హైదర్ గూడ డీమార్ట్ యాజమాన్యాన్ని ఆదేశించింది.