సెర్ఫ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ !

సెర్ఫ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ !

కొత్త పే స్కేలు వర్తింప చేస్తూ జీ ఓ జారీ
జీవో ఎంఎస్ నం.11ను విడుదల చేసిన టీ సర్కార్
నెరవేరిన 23 సంవత్సరాల సెర్ఫ్ ఉద్యోగుల కల
భారీగా పెరిగిన ఉద్యోగుల జీతాలు
మొత్తం 3,978 మంది ఉద్యోగులకు చేకూరిన లబ్ధి
ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి రానున్న కొత్త పే స్కేలు
సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన సెర్ఫ్ ఉద్యోగులు

 

సెర్ఫ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ !warangaltimes, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం సెర్ఫ్ (పేదరిక నిర్మూలనా సంస్థ) ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా అనతి కాలంలోనే కొత్త పే స్కేలు వర్తింపచేస్తూ జీఓఎంఎస్ నంబర్ 11ను జారీ చేసింది. దీంతో 23 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సెర్ఫ్ ఉద్యోగుల కల నెరవేరింది. దీంతో వారి జీతాలు, వేతనాలు భారీగా పెరగనున్నాయి. మొత్తం 3,978 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త పే స్కేలు అమలులోకి రానున్నది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా జీవో జారీ చేశారు.

ఇదిలా ఉండగా సెర్ఫ్ ఉద్యోగులు ఈ జీవో జారీ చేసిన సీఎం కేసీఆర్, తమ కోరికను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, తమ డిమాండ్ సాకారం అయ్యే విధంగా కృషి చేసిన మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ కవిత కు సెర్ఫ్ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు.

23 సంవత్సరాలుగా మిగతా రాష్ట్ర ఉద్యోగుల తరహాలో పెరగని నిర్ణీత నేతనాలతో పనిచేస్తున్న సెర్ప్ ఉద్యోగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఉగాది కానుకగా తీపి కబురు చెప్పారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు, అసెంబ్లీలో మార్చి 15న చేసిన ప్రకటన ప్రకారం సెర్ప్ ఉద్యోగులకు సవరించిన వేతనాలతో కూడిన కొత్త పే స్కేల్ వర్తింపజేస్తూ జీవో నెంబర్ 11 ను ఈ రోజు విడుదల చేశారు. సంస్థలో పనిచేస్తున్న 3,978 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది. దీంతో సెర్ప్ ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.58 కోట్ల అదనపు భారం పడనుంది.

సెర్ప్ ఉద్యోగుల పే స్కేల్ సవరణ జీ ఓ రావడంతో ఆ ఉద్యోగుల ముఖాల్లో ఆనందోత్సాహాలు వెల్లి విరిశాయి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు తెలుపుతూ సెర్ప్ ఉద్యోగులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున పాలాభిషేకం కార్యక్రమాలు జరపడంతో పాటు మంత్రులకు ప్రత్యేకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేయనున్నట్టు సెర్ప్ ఉద్యోగ సంఘాల రాష్ట్ర జేఏసీ నాయకులు ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఇదిలా ఉండగా నిజామాబాద్ జిల్లా భీమ్గల్ లో రాష్ట్ర జేఏసీ తరపున సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగాధర్ రెడ్డి, నరసయ్య, సుదర్శన్, సుభాష్, జానయ్య, వెంకట్, సురేఖలు స్థానిక సిబ్బంది పాల్గొన్నారు. ఇందుకు సహకరించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు , ఎమ్మెల్సీ కవితకు రాష్ట్ర సెర్ప్ ఉద్యోగ సంఘాల జేఏసీ తరపున ధన్యవాదాలు తెలియజేశారు.