రాగల 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్ష సూచన

హైదరాబాద్: మరఠ్వాడా నుంచి కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని, మరోవైపు రుతుపవనాలు క్రియాశీలకంగా ఉన్నాయని, ఆకారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. రాగల 24 గంటల్లో హైదరాబాద్ పాటు నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించారు.