బీజేపీకి రాజీనామా టీఆరెస్ లో చేరిన ఈదులకంటి

మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సమక్షంలో టీఆరెస్ లో చేరిన ఈదులకంటి రమాదేవి, ఈదులకంటి మంజుల

బీజేపీకి రాజీనామా టీఆరెస్ లో చేరిన ఈదులకంటిహుజురాబాద్ : బీజేపీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు ఈదులకంటి రమాదేవి, హుజురాబాద్ పట్టణ మహిళామోర్చ అధ్యక్షురాలు ఈదులకంటి మంజుల మంగళవారం రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు, రైతుబంధు సమితి అధ్యక్షులు,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సమక్షంలో టీఆరెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేంద్రం ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ల విషయంలో నిబంధనలు విధించిందని, కానీ టీఆరెస్ పార్టీ ఎలాంటి నిబంధనలు లేకుండా ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు ఉద్యోగ నియామకాల విషయంలో ఈ డబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల వయోపరిమితి సడలించిందని, అలాగే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చినందున బీజేపీకి రాజీనామా చేసి టీఆరెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కేంద్రం పెట్రోలు, డీజిల్, ధరలు పెంచి సామాన్యులపై భారం మోపుతోందని, అలాగే బడుగు బలహీన వర్గాలకు చేసిందేమి లేదని విమర్శించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆరెస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ విజయం కోసం తాము పనిచేస్తామని పేర్కొన్నారు.