యుద్ధంలో ఏడుగురు రష్యన్ జనరల్స్ హతం

యుద్ధంలో ఏడుగురు రష్యన్ జనరల్స్ హతం

వరంగల్ టైమ్స్, లండన్ : ఉక్రెయిన్ , రష్యా మధ్య యుద్ధంలో ఏడుగురు రష్యన్ జనరల్స్ హతమైనట్లు పశ్చిమ దేశాల అధికారులు వెల్లడించారు. తాజాగా లెఫ్టినెంట్ జనరల్ యాకోవ్ రేజన్ స్టీవ్ మృతి చెందినట్లు పేర్కొన్నారు. యాకోవ్ రష్య 49వ కంబైన్డ్ ఆర్మ్స్ ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్ జనరల్ అని తెలిపారు. రష్యన్ ఆర్మీ కమాండర్ జనరల్ వ్లాయిస్లావ్ యేర్సోహ్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈయన ఆరో కంబైన్డ్ ఆర్మ్స్ ఆర్మీకి చెందిన జనరల్ . అయితే యేర్సోహ్ ను వారం రోజుల క్రితమే బాధ్యతల నుంచి తొలగించారు. ఉక్రెయిన్ పై రష్యా మిలిటరీ జరిపిన దాడిలో వ్యూహాత్మక వైఫల్యాల కారణంగా యేర్సోహ్ ను బాధ్యతల నుంచి ఆకస్మికంగా తొలగించారు.యుద్ధంలో ఏడుగురు రష్యన్ జనరల్స్ హతంఈ ఏడుగురిలో చెచెస్ స్పెషల్ ఫోర్సెస్ జనరల్ మగోమద్ తుషేవ్ కూడా ఉన్నారు. యుద్ధంలంో కేవలం 1300 మంది సైనిక సిబ్బంది మరణించినట్లు క్రెమ్లిన్ శుక్రవారం పేర్కొంది. కానీ ఈ సంఖ్య నాలుగు నుంచి ఐదు రెట్లు అధికంగా ఉండొచ్చని పశ్చిమ దేశాలు అంచనా వేస్తున్నాయి. దాదాపు నెలరోజులుగా కొనసాగుతున్న ఉక్రెయిన్, రష్యా యుద్ధం తీవ్ర గందరగోళాన్ని కల్గిస్తున్నది. ఇరుసేనల్లో ఎవరిది పై చేయి అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. పశ్చిమ దేశాల మీడియాల్లో వస్తున్న కథనాలు, స్వతంత్ర సంస్థల నివేదికలు, ఇరుదేశాల అధినేతల ప్రకటనలు వెరసి అక్కడ వాస్తవంగా ఏం జరుగుతున్నదో తెలియని పరిస్థితి నెలకొన్నది.