ఈనెల 14 నుంచి లాసెట్ కౌన్సిలింగ్

ఈనెల 14 నుంచి లాసెట్ కౌన్సిలింగ్హైదరాబాద్: రాష్ట్రంలోని లా డిగ్రీ కళాశాలలు, పీజీ లా కళాశాలల్లో సీట్ల భర్తీకి సోమవారం నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 22 వరకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు, ఆన్ లైన్ పేమెంట్ ప్రక్రియ కొనసాగనున్నది. ఈ నెల 19 నుంచి 22 వరకు స్పెషల్ క్యాటగిరీ వారు నేరుగా కౌన్సిలింగ్ కేంద్రాలకు హాజరుకావాల్సి వుంటుందని అడ్మిషన్ కన్వీనర్ ప్రొఫెసర్ జీబీరెడ్డి తెలిపారు. కౌన్సిలింగ్ కోసం రిజిస్టర్ చేసుకున్న విద్యార్థుల జాబితాను 24న విడుదల చేయనున్నారు. 26. 27 తేదీల్లో తొలి విడుత వెబ్ ఆప్షన్ల నమోదు కొనసాగనున్నది. 28న ఎడిట్ ఆప్షన్, 29న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు 31 వరకు కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి వుంటుంది. వివరాలకు https://lawcet.tsche.ac.in వెబ్ సైట్ ను సంప్రదించాలన్నారు.