శ్రీవారిని దర్శించుకున్న నాగార్జున దంపతులు

శ్రీవారిని దర్శించుకున్న నాగార్జున దంపతులుతిరుపతి : తిరుమలలో సినీ ప్రముఖులు సందడి చేశారు. నేడు ఉదయం స్వామి వారి‌ నైవేద్య విరామ సమయంలో సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఆయన సతీమణి అక్కినేని అమలలు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం‌ పలికి దర్శన‌ ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందించారు.

అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన సినీనటుడు అక్కినేని నాగార్జున మీడియాతో మాట్లాడారు. కొవిడ్ కారణంగా రెండు సంవత్సరాలు స్వామి వారిని దర్శించుకో లేక పోయామని అన్నారు. నేడు స్వామి వారి ఆశీస్సులు పొందడం సంతోషంగా ఉందన్నారు నాగార్జున దంపతులు. అలాగే ఈ ఏడాది ప్రపంచంలోని ప్రజలందరికి మంచి జరగాలని ప్రార్ధించినట్లు అక్కినేని నాగార్జున చెప్పారు.