శ్రీ సోమేశ్వరుడికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎర్రబెల్లి

శ్రీ సోమేశ్వరుడికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎర్రబెల్లి

అంగరంగ వైభవంగా పాలకుర్తి జాతర ఉత్సవాలు
శివనామస్మరణలతో మార్మోగిన శ్రీ సోమేశ్వరాలయం
పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు
రాష్ట్రంలోనే ప్రధాన టూరిజం హబ్ గా పాలకుర్తి ప్రాంతం : మంత్రి

వరంగల్ టైమ్స్, జనగామ జిల్లా : పాలకుర్తి ప్రాంతాన్ని రాష్ట్రంలోనే ప్రధాన టూరిజం హబ్ గా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి స్వామి దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి సతీసమేతంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సోమేశ్వరుడికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎర్రబెల్లిఈ సందర్భంగా దేవాలయంలో నూతనంగా నిర్మించిన మహా మండపాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం పాలకుర్తిలో సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళిక నిధులతో రూ.1 కోటి 14 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ని ఆయన ప్రారంభించారు. మహాశివరాత్రి పర్వదినాన కన్నుల పండుగగా శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణ మహోత్సవం జరిగింది. శ్రీ సోమేశ్వరుడికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎర్రబెల్లిఆలయంలో స్వామి వారి కల్యాణం వేదమంత్రాల, భక్తుల భజనల మధ్య నిర్వహిస్తుండగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అంతకు ముందు ఆలయ మర్యాదలతో అధికారులు, పూజారులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు.

శ్రీ సోమేశ్వరుడికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎర్రబెల్లిశ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం టూరిజం ప్యాకేజీ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించినట్లు మంత్రి దయాకర్ రావు తెలిపారు. అందులో భాగంగా దేవస్థాన గర్భగుడి, మండప పునరుద్ధరణకు కోటి రూపాయల వ్యయం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రమైన పాలకుర్తి గ్రామ సమగ్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ సహకారంతో ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. అందులో భాగంగా సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళిక నిధుల నుండి మంజూరైన రూ.21 కోట్ల 24 లక్షల వ్యయంతో పాలకుర్తి లో జంక్షన్ అభివృద్ధి పనులను చేపట్టినట్లు ఆయన తెలిపారు. దీనికి తోడుగా పాలకుర్తి – వరంగల్ కు, పాలకుర్తి – జనగామ, పాలకుర్తి – తిరుమలగిరి, పాలకుర్తి – తొర్రూరు తారు రోడ్లను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేయడం జరిగిందని ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. పాలకుర్తి నియోజకవర్గంలో తారు రోడ్డు సౌకర్యానికి వంద కోట్ల రూపాయలను వ్యయం చేసినట్లు ఆయన తెలిపారు.శ్రీ సోమేశ్వరుడికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎర్రబెల్లిఒక వైపు శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన అభివృద్ధితో పాటుగా వల్మీడి సీతారామ స్వామి దేవస్థాన అభివృద్ధికి, బొమ్మెర పోతన స్మారక మందిర అభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి పరుస్తున్నట్లు ఆయన తెలిపారు.బమ్మెర గ్రామంలో బమ్మెర పోతన మందిరం, ఇతర అభివృద్ధి పనులకు 10 కోట్లు వ్యయం చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అంతేకాకుండా వల్మీడి సీతారామ స్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు 8 కోట్ల రూపాయలను వ్యయం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పుస్కురి శ్రీనివాస్ రావు, ఎంపీపీ నాగిరెడ్డి, సర్పంచ్ యాకాంత రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, దేవస్థాన కమిటీ చైర్మన్ రాం చంద్రయ్య శర్మ తదితరులు పాల్గొన్నారు.