సమతామూర్తి భావి తరాలకు స్ఫూర్తి : అమిత్ షా

సమతామూర్తి భావి తరాలకు స్ఫూర్తి : అమిత్ షావరంగల్ టైమ్స్,హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముచ్చింతల్ లోని సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించారు. ఆశ్రమానికి వచ్చిన అమిత్ షాకు చిన్నజీయర్ స్వామి తదితరులు హార్ధిక స్వాగతం పలికారు. శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది మహోత్సవాలకు అమిత్ షా పంచెకట్టు, తిరునామంతో వచ్చారు. ఆశ్రమంలోని విశేషాలను ఆయనకు చిన్నజీయర్ స్వామి వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా ప్రసంగించారు.

శ్రీరామానుజాచార్యుల వారి దివ్య సందేశం స్ఫూర్తిదాయకం అని అమిత్ షా పేర్కొన్నారు. మనుషులంతా ఒక్కటేనని రామానుజాచార్యులు చాటి చెప్పారని, సమతామూర్తి భావితరాల వారికి స్ఫూర్తి మంత్రం అని పేర్కొన్నారు. ఇక్కడికి రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని అమిత్ షా తెలిపారు. సనాతన ధర్మం అన్నింటికీ మూలం అని వెల్లడించారు. సమతా మూర్తి విగ్రహ ఏకతా సందేశాన్ని అందిస్తోందని అమిత్ షా వివరించారు.