భారత్ లో కొత్తగా 236 మందికి కరోనా 

భారత్ లో కొత్తగా 236 మందికి కరోనా

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : భారత్ లో కొత్తగా 236 కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం వరకు 1,29,159 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 236 మందికి పాజిటివ్ వచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 4,41,42,989 మంది వైరస్ నుంచి కోలుకున్నారని తెల్పింది. మరో 5,30,693 మంది మరణించారని, 3424 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని తెల్పింది.భారత్ లో కొత్తగా 236 మందికి కరోనా మొత్తం కేసుల్లో 0.01 శాతం కేసులు యాక్టివ్ గా ఉండగా, 98.80 శాతం మంది కోలుకున్నారని , 1.19 శాతం మంది మరణించారని వెల్లడించింది. గత 24 గంటల్లో 1,11,304 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశామని, ఇప్పటివరకు 2,20,05,16,249 కరోనా టీకాలను పంపిణీ చేశామని తెల్పింది.