భద్రాచలంలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

భద్రాచలంలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

వరంగల్ టైమ్స్, భద్రాచలం : భద్రాచలంలో క్షేత్రంలో రామయ్య కల్యాణ వేడుక కన్నుల పండుగగా , అంగరంగ వైభవంగా జరిగింది. అభిజిత్ ముహూర్తాన శ్రీసీతారామచంద్రుల కల్యాణం కమనీయంగా సాగింది. భక్త శ్రీరామదాసు చేయించిన ఆభరణాలను అలంకరించుకుని రామయ్య పెండ్లికొడుకుగా , సీతమ్మ పెండ్లికూతురుగా దర్శనమిచ్చారు. భద్రాచలంలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణంసరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు జీలకర్ర, బెల్లం పెట్టారు.అనంతరం మాంగళ్యధారణ జరిగింది. రాములవారి కల్యాణానికి ప్రభుత్వం తరుపున మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ తరపున వైవీ సుబ్బారెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.భద్రాచలంలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణంరెండేళ్ల తర్వాత స్వామి వారి కల్యాణానికి భక్తులను అనుమతించడంతో మిథిలా స్టేడియం కిక్కిరిసిపోయింది. ఆలయ వీధులు భక్తజన సందోహంగా మారాయి. శ్రీరామ నామస్మరణతో భద్రగిరి మారుమ్రోగింది. కొవిడ్ కారణంగా రెండేళ్ల పాటు శ్రీరామనవమి ఉత్సవాలను అంతరంగికంగానే నిర్వహించారు.