ఎంజీఎం ఘటనపై స్పందించిన హరీశ్ రావు 

ఎంజీఎం ఘటనపై స్పందించిన హరీశ్ రావు

వరంగల్ టైమ్స్ , హైదరాబాద్ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శ్రీనివాస్ అనే పేషెంట్ కాలిని ఎలుకలు గాయపరిచిన ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు సీరియస్ గా స్పందించారు. ఈ ఘటనపై మంత్రి విచారణకు ఆదేశించారు. ఇప్పటికే ఆ పేషెంట్ చికిత్స పొందుతున్న వార్డును అడిషనల్ కలెక్టర్ పరిశీలించారు. సాయంత్రం లోగా నివేదిక వచ్చే అవకాశం ఉంది. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.ఎంజీఎం ఘటనపై స్పందించిన హరీశ్ రావు ఈ ఘటనపై ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ రావు స్పందించారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రోగుల బంధువులు బయటి నుంచి ఆహారం తీసుకొచ్చి బెడ్ల వద్ద పడేయడం వల్లనే ఎలుకల బెడద ఎక్కువైందని శ్రీనివాస్ రావు పేర్కొన్నారు.