‘సదైవ్ అటల్’ వద్ద నివాళులర్పించిన మోడీ

‘సదైవ్ అటల్’ వద్ద నివాళులర్పించిన మోడీ'సదైవ్ అటల్' వద్ద నివాళులర్పించిన మోడీ

– ‘సదైవ్ అటల్’వద్ద రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
– పుష్పాంజలి ఘడించిన మంత్రులు, బీజేపీ నేతలు

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి 99వ జయంతిని బీజేపీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ఢిల్లీలో వాజ్ పేజ్ స్మృతివనం ‘సదైవ్ అటల్’వద్ద ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పలువురు నివాళులు అర్పించారు. ప్రధానితో పాటు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, స్పీకర్ ఓం బిర్లా తదితరులు పుష్పాంజలి ఘటించారు. ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా వాజ్ పేజ్ గొప్పతనాన్ని తెలిపారు. భారతదేశాన్ని బలోపేతం చేయడానికి, అభివృద్ధి చేయడానికి అటల్ బిహారీ వాజ్ పేయి తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. దేశానికి ఆయన చేసిన సేవ మనందరికీ స్ఫూర్తిదాయకం అని తెలిపారు. వాజ్ పేయి చేసిన అభివృద్ధి పనులను లక్షలాది మంది భారతీయుల జీవితాలను ప్రభావితం చేశాయని అన్నారు.