తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవితవరంగల్ టైమ్స్, తిరుమల: శ్రీవారి నిజపాద దర్శనం సేవలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత, అనిల్ దంపతులు.ఈరోజు ఉదయం స్వామివారికి జరిగే నిజపాదసేవలో స్వామివారిని దర్శించికొని, మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్సీ కవిత.నిన్న కాలినడకన తిరుమలకు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత దంపతులకు స్వాగతం పలికిన అధికారులు.శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు, స్వామి వారి పట్టు వస్త్రాలను అందజేశారు.