కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రోజా

కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రోజా

వరంగల్ టైమ్స్ , హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా శుక్రవారం సాయంత్రం ప్రగతి భవన్ కు వచ్చారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో రోజా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రోజాకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రోజా

కేసీఆర్ తో సమావేశం ముగిసిన అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. మంత్రి అయ్యాక కుటుంబంతో కలిసి ప్రగతి భవన్ కు రావాలని కేసీఆర్ ఆహ్వానించారని తెలిపారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశానని రోజా తెలిపారు. ప్రగతి భవన్ కు కుటుంబసమేతంగా వెళ్లిన రోజాకు సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కూతురు కల్వకుంట్ల కవిత కుంకుమ పెట్టి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారని తెలిపారు. కేసీఆర్ తనను ఓ కూతురిగా చూస్తారని, ఆయన ఆశీర్వాదం తీసుకునేందుకు ప్రగతి భవన్ కు వచ్చానని రోజా స్పష్టం చేశారు.కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రోజా