డిశ్చార్జ్ అయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

డిశ్చార్జ్ అయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

– నందినగర్ లోని సొంతింటికి చేరుకున్న కేసీఆర్
– ఎడమ తుంటికాలికి గాయం
– యశోద ఆస్పత్రిలో వారం రోజులు చికిత్స
– డిసెంబర్ 8న తన ఫాం హౌస్ లో జారిపడ్డ కేసీఆర్
– 6 నుంచి 8 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలన్న వైద్యులు

డిశ్చార్జ్ అయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆస్పత్రి నుంచి శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. వేద పండితుల పూజల అనంతరం కేసీఆర్ ఆస్పత్రి నుంచి నేరుగా బంజారాహిల్స్ నందినగర్ లోని తన సొంతింటికి వెళ్లారు. కేసీఆర్ తో పాటు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ కుమార్ లు ఉన్నారు. సొంతింటికి చేరుకున్న కేసీఆర్ కు తన కూతురు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో సాంప్రదాయ పద్ధతిలో దిష్టితీసి, హారతితో ఇంట్లోకి స్వాగతం పలికారు.డిశ్చార్జ్ అయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్అనంతరం కేసీఆర్ తన ఇంట్లోకి అడుగుపెట్టారు. డిసెంబర్ 8న తన ఫాం హౌస్ లో కేసీఆర్ కు ఎడమ కాలి తుంటి ఫ్రాక్చర్ కావడంతో యశోద ఆస్పత్రిలో ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహించిన విషయం తెలిసిందే. వారం రోజుల పాటు చికిత్స అనంతరం కోలుకున్న నేపథ్యంలో కేసీఆర్ ను శుక్రవారం ఉదయం వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా తనకు చికిత్స అందించిన వైద్యులు, నర్సులు సహా యశోద సిబ్బందికి కేసీఆర్ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. తన కోసం వచ్చిన అభిమానులకు అభివాదం చేశారు కేసీఆర్.