యాదాద్రి పనులను పరిశీలించిన కేసీఆర్

యాదాద్రి పనులను పరిశీలించిన కేసీఆర్

వరంగల్ టైమ్స్,యాదాద్రి భువనగిరి జిల్లా : దాదాపుగా పూర్తికావస్తున్న యాదాద్రి ఆలయ పరిసరాలను కలియ తిరుగుతూ పునర్నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ప్రధాన ఆలయం, గర్భగుడిని సీఎం కేసీఆర్ ప్రత్యేకించి పరిశీలించారు. కాలినడకన ఆలయం చుట్టూ తిరిగిన సీఎం పలు సూచనలు చేశారు. సోమవారం మధ్యాహ్నం యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.

అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బాలాలయంలో లక్ష్మీ నారసింహుడికి సీఎం కేసీఆర్ పూజలు చేశారు. అర్చకులు సీఎం కేసీఆర్ కు ఆశీర్వచనం అందచేశారు. అనంతరం ఆలయ ఈవో స్వామివారి ప్రసాదాన్ని సీఎంకు అందచేశారు.యాదాద్రి పనులను పరిశీలించిన కేసీఆర్కళ్యాణకట్ట, పుష్కరిణీ నిర్మాణ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం కేసీఆర్ మంత్రులు, అధికారులకు పలు సూచనలు చేశారు. 75 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్వహించనున్న సుదర్శనయాగం ఏర్పాట్లను , అన్నదాన సత్రాలు, ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణాలను సీఎం పరిశీలించారు. వ్రత మండపాల నిర్మాణం, దీక్షాపరుల మండపాలను సీఎం పరిశీలించారు. పుష్కరిణిలో భక్తులు మునిగి వందన కార్యక్రమాలు ఆచరించిన తర్వాత, స్నానం చేసేందుకు పురుషులకు, స్త్రీలకు విడివిడిగా స్నానపు గదుల నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు.యాదాద్రి పనులను పరిశీలించిన కేసీఆర్ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ వెంట చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గ్యాదరి కిశోర్, మర్రి జనార్ధన్ రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు ఉన్నారు.