అక్కడ భారీగా మందుగుండు సామాగ్రి లభ్యం

అక్కడ భారీగా మందుగుండు సామాగ్రి లభ్యంభువనేశ్వర్ : ఒడిశాలోని స్వాభిమాన్ అంచల్ ఏరియాలో బీఎస్ఎఫ్ కు చెందిన ప్రత్యేక బలగాలు నిన్న కూబింగ్ చేపట్టాయి. రోడ్డు పక్కన అమర్చిన 3 ఐఈడీలను గుర్తించి, నిర్వీర్యం చేశారు. వీటిని టిఫిన్ బాక్సుల్లో అమర్చినట్లు బలగాలు నిర్ధారించాయి.

ఇక ఆ ఏరియాలోనే భారీగా మందుగుండు సామాగ్రితో పాటు జనరేటర్ ను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆంధ్రా- ఒడిశా సరిహద్దుకు చెందిన మావోయిస్టులే పేలుళ్లకు ప్లాన్ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.