హిజాబ్ పై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

హిజాబ్ పై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలువరంగల్ టైమ్స్, హైదరాబాద్: హిజాబ్ వివాదంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. మహిళల వస్త్రధారణ విషయంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. స్త్రీలు సృష్టికర్తలు, వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందన్నారు. ఈ సందర్భంగా తాను చేతితో రాసిన కవితను ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. నుదుటున సింధూరం పెట్టుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ అయినప్పుడు, హిజాబ్ ధరించడం ముస్కాన్ వ్యక్తిగత స్వేచ్ఛ అవుతుందన్నారు. ఎలా ఉండాలి ? ఏం ధరించాలి ? ఏం చేయాలి ? అన్న విషయాలను మహిళల ఇష్టాఇష్టాలకే వదిలేయాలని కవిత సూచించారు.

*ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత రాసిన ‘కవిత’

హిందూ-ముస్లిం-సిక్కు-క్రిస్టియన్ మతమేదైనా సరే..
మనమంతా భారతీయులమే..!!
సిందూర్-టర్బన్-హిజాబ్-క్రాస్
ఏది ధరించినా మన గుర్తింపు భారతీయతే..!!
‘ త్రివర్ణ పతాకాన్ని’ రూపొందించిన పింగళి వెంకయ్య అయినా..
‘ జై హింద్’ అని నినదించిన అబిద్ హసన్ సఫ్రానీ అయినా..
‘ సారే జహాన్ సే అచ్చా హిందుస్తాన్’ అని ఎలుగెత్తి చాటిన ముహమ్మద్ ఇక్బాల్ అయినా..
‘ జన గణ మన’ తో జాతిని ఏకం చేసిన రవీంద్రనాథ్ ఠాగూర్ అయినా..
మనకు చెప్పింది ఒక్కటే..
మనం ఎవరైనా..మనమంతా భారతీయులమనే..!!