భద్రకాళి మినీ బండ్ ను ప్రారంభించిన మంత్రి

భద్రకాళి మినీ బండ్ ను ప్రారంభించిన మంత్రి

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : చారిత్రక నేపథ్యం ఉన్న ఓరుగల్లుకు భద్రకాళి బండ్ మరో మణిహారంగా మారుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆనందం వ్యక్తం చేశారు. రూ. 2 కోట్ల 10 లక్షలతో నిర్మించిన 570 మీటర్ల పొడవైన భద్రకాళి మినీ బండ్ ను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్యతో కలిసి మంత్రి దయాకర్ రావు ప్రారంభించారు.భద్రకాళి మినీ బండ్ ను ప్రారంభించిన మంత్రిఇక వరంగల్ అంటేనే భద్రకాళి గుడి, భద్రకాళి గుడి అంటేనే వరంగల్ అనే అభిప్రాయం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. అలాంటి భద్రకాళి గుడికి కోట్ల రూపాయల నిధులు వెచ్చించి సుందరంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్ దేనని కొనియాడారు. దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులు పర్యాటకులను సైతం ఆకట్టుకునేలా భద్రకాళి బండ్ ను తీర్చిదిద్దినట్లు తెలిపారు.