సమతామూర్తి విగ్రహాం అద్భుతం: ఆర్ఎస్ఎస్ చీఫ్

సమతామూర్తి విగ్రహాం అద్భుతం: ఆర్ఎస్ఎస్ చీఫ్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్: ముచ్చింతల్ లో రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. సమతా మూర్తి శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని సందర్శించారు. ఆయనతో పాటు మధ్యప్రద్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దంపతులు సైతం రామానుజాచార్యులను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వీరికి చినజీయర్ స్వామితో పాటు వేదపండితులు శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పరిసరాల్లోని దేవాలయాలను పరిశీలించారు. యాగశాలల్లోని పూజాధి కార్యక్రమాలను చినజీయర్ స్వామి వారికి వివరించారు.