మూడో వన్డేలో భారత జట్టు గ్రాండ్ విక్టరీ

మూడో వన్డేలో భారత జట్టు గ్రాండ్ విక్టరీ

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : మూడో వన్డేలో టీం ఇండియా భారీ విజయం సాధించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఇండియా 317 రన్స్ తేడాతో శ్రీలంకను ఓడించింది. పేసర్ మహమ్మద్ సిరాజ్ ధాటికి శ్రీలంక టాపార్డర్ కుప్పకూలింది. అతని పేస్ ఎఫెక్ట్ కు టపటపా వికెట్లు కోల్పోయింది. కీలకమైన నవనిదు ఫెర్నాండో (19), కుశాల్ మెండిస్ (4), ఆవిష్క ఫెర్నాండో (1), చరిత అసలంక(1) లను సిరాజ్ ఓడించడంతో లంక కోలుకోలేకపోయింది. ఆ తర్వాత షమీ, కుల్దీప్ యాదవ్ వికెట్ల వేట కొనసాగించారు. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఓవర్ లో శ్రీలంక టీం కెప్టెన్ దసున్ షనక బౌల్డ్ అయ్యాడు.మూడో వన్డేలో భారత జట్టు గ్రాండ్ విక్టరీ16 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయింది. 22వ ఓవర్ చివరి బంతికి కుమరను కుల్దీప్ బౌల్డ్ చేయడంతో 73 పరుగులకే లంక ఇన్నింగ్స్ ముగిసింది. టీం ఇండియా బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లు, షమీ, కుల్దీప్ యాదవ్ చెరో 2 వికెట్లు తీశారు. దాంతో మూడు వన్డేల సిరీస్ ను 3-0తో టీమిండియా గెలుచుకుంది. ఈ సిరీస్ లో 2 శతకాలు బాదిన విరాట్ కోహ్లీ ‘ప్టేయర్ ఆఫ్ ది మ్యాచ్’ , ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నాడు.