మన ఊరు-మన బడి.. 50% స్కూల్స్ కి నిధులు

మన ఊరు-మన బడి.. 50% స్కూల్స్ కి నిధులు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమం అమలు తీరుపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల, డిజిటల్ విద్య, ఇంగ్లీష్ మీడియంలో బోధన, సంబంధిత అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.మన ఊరు-మన బడి.. 50% స్కూల్స్ కి నిధులుసమావేశం ముగిసిన అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. మన ఊరు-మన బడి పురోగతిపై సమావేశంలో చర్చించామని తెలిపారు. మొదటి దశలో 50 శాతం స్కూళ్లకు నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. ఈ పాఠశాలల్లో జూన్ 12 నాటికి పనులు పూర్తి చేయాలని, ఆ బాధ్యతలను కలెక్టర్లు తీసుకోవాలని ఆదేశించారు. ఈ యేడాది నుంచే 8వ తరగతి వరకు ఇంగ్గీష్ మీడియంలో బోధన చేపడుతామన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చినట్లు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి స్పష్టం చేశారు. ఇంగ్లీష్ మీడియం బోధనాంశాన్ని విస్తృతంగ ప్రచారం చేయాలన్నారు.