తెలంగాణలో ఉపాధి హామీ వేతనం పెంపు 

తెలంగాణలో ఉపాధి హామీ వేతనం పెంపు

వరంగల్ టైమ్స్ , హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధి హామీ వేతనం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రోజువారీ వేతనాన్ని రూ. 245 నుంచి రూ.257 కు పెంచింది. పెంచిన ఉపాధి హామీ వేతనాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పలు గ్రామాల్లో కొనసాగుతున్న పనులను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. కూలీల హాజరు, పనుల వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. జాబ్ కార్డు ఉన్న ప్రతీ కూలీకి వందరోజుల పని కల్పించాలన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉదయం వేళ పనులను చేయించాలని, కూలీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.