వరంగల్ లో ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు ఇవే

వరంగల్ లో ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు ఇవే

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి, సీఎంఏ, మునిసిపల్ సాధారణ నిధులు, స్మార్ట్ సిటీ, స్టేట్ గ్రాంట్ ఫండ్ పథకాల క్రింద రూ.27.63 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తార‌ని, 150.20 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు మంత్రి చేస్తారని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు నక్కలగుట్టలోని హరిత కాకతీయలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. వరంగల్ లో ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు ఇవేరూ.7 కోట్ల వ్యయంతో భద్రకాళి దేవాలయ కమాన్ నుండి జీడబ్ల్యూ ఎంసీ కార్యాలయం వరకు నిర్మించిన నెంబ‌ర్ 4 రోడ్డును, 7 కోట్ల రూపాయల వ్యయంతో అలంకార్ దర్గా బ్రిడ్జ్ నుండి రోడ్ నెం.2 వరకు నిర్మించిన స్మార్ట్ రోడ్ ఆర్3 ను ప్రారంభిస్తార‌ని, 11.50 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన పబ్లిక్ గార్డెన్స్ , 1.5 కోట్ల రూపాయల వ్యయంతో నవీకరించబడిన ప్రాంతీయ గ్రంథాలయాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అదే విధంగా రూ. 27 లక్షలతో కొనుగోలు చేసిన రెండు వైకుంఠ రథాలను, రూ. 36 లక్షలతో కొనుగోలు చేసిన 66 ఫాగింగ్ మెషిన్ లను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ వివ‌రించారు.

రూ. 8 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న 150 కే ఎల్ డి , ఎఫ్ ఎస్ పి పి ను మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా 20.50 కోట్లతో నిర్మించనున్న మహానగర పాలక సంస్థ పరిపాలనా భవనానికి, 2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కౌన్సిల్ హాల్ కు, 2 కోట్లతో విద్యుత్ నగర్ లో నిర్మించనున్న దివ్యాంగుల శిక్షణ కేంద్రానికి, 9 కోట్లతో 37 ప్రభుత్వ పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయ‌డానికి, 1.50 కోట్లతో పోతన వైకుంఠధామం అభివృద్ధికి, 22 కోట్లతో నయీమ్ నగర్ నుండి ప్రెస్టీన్ స్కూల్ వరకు రిటైనింగ్ వాల్ ఏర్పాటుకు, 15 కోట్లతో నాలాల మీద కల్వర్టుల నిర్మాణానికి, జి డబ్యు ఎంసీ ప్రధాన కార్యాలయంలో 71 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు, 2.50 కోట్లతో కాజీపేట నుండి పెద్దమ్మగడ్డ వరకు ఆర్సీసి రిటైనింగ్ వాల్ నిర్మాణానికి, 70 లక్షలతో కాకతీయ మ్యూజికల్ గార్డెన్ లో ఏర్పాటు చేయనున్న జాతీయ జెండాకు, జిడబ్ల్యూ ఎంసీ ఆవరణలో 4 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లకు జిడబ్ల్యూ ఎంసీ కార్యాలయం వద్ద ఒకే చోట మంత్రి శంకుస్థాపనలు చేస్తార‌ని మంత్రులు వివ‌రించారు.