రేపటి నుంచే టీచర్ల బదిలీలు 

రేపటి నుంచే టీచర్ల బదిలీలు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రాష్ట్రంలో శుక్రవారం నుంచి టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో నంబర్ 5 ను గురువారం జారీ చేశారు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు, మాన్యువల్ గా పదోన్నతులు జరుగనున్నాయి. రేపు కేటగిరీ ఖాళీలు, ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి అర్హులైన స్కూల్ అసిస్టెంట్స్ సీనియారిటీ జాబితాలు ఆన్లైన్ లో ప్రకటిస్తారు. జనవరి 28 నుంచి 30 వరకు బదిలీల కోసం ఆన్లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తారు.

 

దరఖాస్తుల హార్డ్ కాపీలను ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయుల సంబంధిత ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత టీచర్లు సంబంధిత ఎమ్ఈవోలకు మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉపాధ్యాయులు సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు డీఈవోకు ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 2 లోపు సమర్పించాలి.